rajandranagartimes.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 6:54 am Digital Edition : RAJANDRANAGAR TIMES

శంషాబాద్ కు భారీగా తరలిన నాయకులు కార్యకర్తలు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తెలంగాణకు మొదటిసారిగా వచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కిస్మత్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నుండి రంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ కార్యవర్గ సభ్యుడు మాజీ ఉపసర్పంచ్ నీరుడు శేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. బుధవారం ఉదయం కిస్మాత్ పూర్ నుండి ఆరమైసమ్మ దేవాలయం వరకు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అంతా కలిసి ర్యాలీగా వెళ్లారు.అనంతరం ఆరామైసమ్మ దేవాలయం వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించి పెద్ద ఎత్తున ర్యాలీగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఉన్నారు.