Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణసైబరాబాద్ప్రముఖుల చేతి మీదుగా మన్నే శ్రీ భజన కీర్తనల పుస్తకావిష్కరణ....

ప్రముఖుల చేతి మీదుగా మన్నే శ్రీ భజన కీర్తనల పుస్తకావిష్కరణ….

📰 Generate e-Paper Clip

ప్రముఖుల చేతి మీదుగా మన్నే శ్రీ భజన కీర్తనల పుస్తకావిష్కరణ…. ప్రముఖ రచయిత కవి గాయకుడు మన్నెమాత్మ రావు గారు రచించిన మన్నే శ్రీ భజన కీర్తనల పుస్తకావిష్కరణ రాజేంద్రనగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించడం జరిగింది… మన్నే మాత్మ రావు గారు ఇప్పటివరకు 13 ఆధ్యాత్మిక పుస్తకాలు రెండు వేల వరకు భజన పాటలు రచించడం పాడడం జరిగింది
వీటిలో నుంచి ఆధ్యాత్మిక మరియు భజన పాటలను పొందుపరిచి 108 పాటలను పుస్తకంలో పొందుపరిచి నేడు ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ తొలి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర గణేష్ ముదిరాజ్ బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీధర్ అన్నపురెడ్డి భీమార్జున్ రెడ్డి కిస్మత్పూర్ మాజీ ఉపసర్పంచ్ నీరుడుశేఖర్ ముదిరాజ్ సిపిఐ నాయకులు పుస్తకాల నర్సింగ్ రావు గారు బాలరాజు గారు జేఏసీ నాయకులు రామకృష్ణ ఈ సందర్భంగా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర గణేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ మన్నే మాత్మ రావు గారు చిన్ననాటి నుంచి మాకు పరిచితులని ఆయన పాటలు భజనలు మమ్ములను ఎంతో ప్రభావితం చేసేవని ఒక ముదిరాజ్ అయినందుకు ఎంత గర్వంగా ఉందని ఆయన పాట రచనలు ఎల్లప్పుడూ ప్రజలను ఉంటాయని అన్నారు స్వామి గౌడ్ మాట్లాడుతూ మహాత్ముడని ఆయన పాటలు అన్న రచనలు అన్న చుట్టుపక్కల వాళ్లకు తెలియని కావని ఇక్కడ రంగారెడ్డి జిల్లా రాయదుర్వాసులుగా ముఖ్యంగా కిస్మత్పూర్ వాసిగా చాలా గర్వపడుతున్నట్లు చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక చింతన భజన భక్తి రచనల పట్ల ఆయనకు ఎక్కువ అవగాహనట్టు ఆయన నాటకాలు ఆడిపిచ్చేదని ఈ సందర్భంగా కొనియాడారు.

బిజెపి రాష్ట్ర నాయకులు పడమటి శ్రీధర్ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ఆధ్యాత్మిక చింతన మాత్మ రావు గారు రాజేంద్రనగర్ ప్రాంతంలో చాలామందికి శిక్షణ ఇస్తున్నారు భజన కీర్తనలు నేర్పిస్తున్నారు పిల్లలకి భక్తి పాటలు తో పాటు ఆధ్యాత్మిక చింతన అందించడం సంతోషకరమని భీమార్జునుడి మాట్లాడుతూ చిన్నప్పటినుంచి మాకు పాటలన్నా భజన అన్న మహాత్మా రావు గారి గుర్తిస్తారని . నీరుడు శేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ మహాత్మారావు గారి పాటలకు చిన్నప్పుడు నుంచి అభిమానిని ఇకముందు ఏవైనా పుస్తకావిష్కరణలు ఉంటే కనుక తాము ప్రచురిస్తామని అందుకు అవకాశం కల్పించాలని కోరారు.

సిపిఎం నాయకులు పుస్తకాలు నర్సింగరావు మాట్లాడుతూ మహాత్మా రావు గారి సేవలను గుర్తించి ఇక్కడ వచ్చినటువంటి వివిధ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు అందరం కలిసి ప్రభుత్వం నుంచి మహాత్మా రావు గారికి ప్రభుత్వ గుర్తింపు కొరకు కృషి చేయాలని తెలియపరచారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు వివిధ కుల సంఘాల నాయకులు మాత్మ రావు మిత్రులు కుటుంబ సభ్యులు శిష్య బృందం ప్రజా సంఘ నాయకులు జేఏసీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు చివరిగా మన్నె మహాత్మారావు మాట్లాడుతూ తాను బావిత్వానికి గురై కన్నీళ్లు పెట్టుకొని ఎంతమంది ఆప్తుల మధ్యల అందరి సహకారంతో ఇంత శక్తినిచ్చి కొట్టు అటువంటి భగవంతునికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular